📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, July 28, 2026
Visitors: 1,537,183  |  115 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుభారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ బ్యాన్ అవాస్తవం: కేంద్ర ప్రభుత్వం, PIB స్పష్టతఉద్యోగ ప్రకటన: 40 వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యుపిఎస్సి దరఖాస్తుల ఆహ్వానంనూతన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి: అదనపు బాధ్యతలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వంనీట్ వివాదం వేళ ధర్మేంద్ర ప్రధాన్ ఆవేదన: విద్యాశాఖ పదవికి రాజీనామా చేస్తూ భావోద్వేగ లేఖహనీమూన్ హత్యలు - క్షీణిస్తున్న సాంఘిక విలువలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫీజు బకాయిలపై ఆందోళన – యాజమాన్యాలతో అధికారుల చర్చలు

September 15, 2025 September 15, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణలో వృత్తి విద్యా సంస్థలు (ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర కాలేజీలు) నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కి దిగిన నేపథ్యంలో, విద్యా వ్యవస్థలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాలేజీ యాజమాన్యాల నిరసనలు ఊపందుకోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది.

చదువు కొనసాగుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఆదివారం రాత్రి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు కాలేజీ యాజమాన్య ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు జరిపారు. ఆ చర్చల్లో ప్రభుత్వం సమస్యను పాజిటివ్‌గా తీసుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చినప్పటికీ, స్పష్టమైన నిర్ణయాలపై మౌనమే నిలిచింది. దీంతో ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులిద్దరూ సమావేశమై ఈ సమస్యపై సమాలోచనలు నిర్వహించారు.

విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పరిణామాలను పరిశీలిస్తూ, విద్యా సంస్థల ప్రతినిధులతో మరింత లోతుగా చర్చలు జరుపుతున్నారు. కాలేజీ యాజమాన్యాలకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, విద్యార్థులకు అందుతున్న నష్టాన్ని సమతుల్యంగా పరిశీలించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం బకాయిలను పూర్తిగా ఎలా, ఎప్పుడు చెల్లించబోతుందన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో నాలుగు సంవత్సరాలుగా ఏర్పడిన పెండింగ్ కారణంగా అనేక విద్యాసంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయని యాజమాన్యాలు వాపోతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాల అందించడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు, ల్యాబ్‌లు, హోస్ట్‌ల్‌, ఇతర నిర్వహణ ఖర్చులన్నీ తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల ఫలితాన్ని బట్టి తమ తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. మరోవైపు, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది రాష్ట్ర విద్యావ్యవస్థ భవితవ్యాన్ని నిర్దేశించనుంది.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *